ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ప్రభుత్వశాఖలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 04:02 PM

ఏపీలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటైంది. ఈ శాఖలో ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది నియమిస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని ఈ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు శిక్షణ అంశాన్ని కొత్తశాఖ పర్యవేక్షించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com