ఏపీలో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటైంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటైంది. ఈ శాఖలో ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది నియమిస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని ఈ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు శిక్షణ అంశాన్ని కొత్తశాఖ పర్యవేక్షించనుంది.