ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతకు సంబంధించి చట్టం తెచ్చే అంశం పై చర్చ జరిగింది. ఈ చర్చలో మాట్లాడిన సీఎం జగన్ హైదరాబాద్ దిశ ఘటనను ప్రస్తావనకు తెచ్చారు. దిశ సంఘటనలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారన్నారు. ఏదేమైనా సరే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ అని సీఎం జగన్ అన్నారు. నిజంగా కేసీఆర్ మరియు పోలీసు అధికారులకు హ్యాట్సాఫ్ అంటూ సీఎం జగన్ సెల్యూట్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం అభినందించడం చర్చనీయాంశమైంది.