కేంద్రహోం మంత్రి అమిత్షాలాంటి వారే ఇప్పటి రాజకీయాలకు సరిపోతారని.. ఆయనలా ఉక్కుపాదంతో అణిచివేసే వారికే వీళ్లు భయపడుతున్నారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాలకోసమే తాను కష్టపడుతున్నానని చెప్పారు. తిరుపతిలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ప్రజల కష్టాలను చూసి వ్యథ పడలేకే పార్టీ పెట్టానన్నారు. నా మతం మానవత్వం.. కులం మాట తప్పని కులం అని జగన్ రెడ్డి అన్నారు. అంటే మిగతా కులాలు మాట తప్పేకులాలా?చట్టాలను కాపాడే నాయకులే దుర్భాషలు మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడాలని రాజ్యాంగం మీకు చెప్ప లేదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డిని నేను ముఖ్యమంత్రిగా నేను గుర్తించను. మాటలు రాని చెట్లను చంపేస్తున్న వారిని ఎందుకు గౌరవించాలి? గొర్రెలను బలిస్తారు కానీ సింహాలను బలివ్వలేరు అని అంబేడ్కర్ అన్నారు.. రాయలసీమ ప్రజలు సింహాల్లా మారాలి. ఆరు నెలలు గొప్ప పాలన అంటున్నారు.. రాయితీ ధరకు ఉల్లిపాయలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం మీది’’ అంటూ వైకాపాను ఉద్దేశించి పవన్ దుయ్యబట్టారు.