పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దిశ రేప్ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా జీరో అవర్లో చర్చిద్దామని సభ్యులకు తెలిపారు. దీంతో క్వశ్చన్ అవర్ను రద్దు చేసి వెంటనే దిశ రేప్ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.