న్యూఢిల్లి : భారతదేశంతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకుని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష చెప్పారు. రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగత కార్యక్రమం అనంతరం ఇయన మాట్లాడుతూ భారత్, శ్రీలంక దేశాలు రెండూ భద్రత, ప్రజల సంక్షేమం కోసం కలిసి కృషి చేయాల్సి ఉందన్నారు. శ్రీలంక సైన్యం ఆధీనంలో ఉన్న భారత్ మత్స్యకారుల పడవలను విడుదల చేస్తామన్నారు.