ఏపీ సర్కార్ నూతన బార్ల లైసెన్సులకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ లైసెన్స్ లు 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు పని చేస్తాయి. గెజిట్ నోటిఫికేషన్ లో వివరాలిలా ఉన్నాయి.
- 2020 జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీ.
- మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు.
- కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు రూ. 4లక్షల 50 వేలు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్దారణ.
- విజయవాడ,విశాఖలో దరఖాస్తు ఫీజు రూ.7 లక్షలుగా నిర్దారణ.
- ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా నిర్దారించిన ప్రభుత్వం.
- ఇవాల్టి నుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ.
- డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు.
- అదే రోజు రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల.