ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2019, 04:09 PM

ఏపీ సర్కార్ నూతన బార్ల లైసెన్సులకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ లైసెన్స్ లు 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు పని చేస్తాయి. గెజిట్ నోటిఫికేషన్ లో వివరాలిలా ఉన్నాయి.


- 2020 జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు లైసెన్సులు జారీ.


- మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు యూనిట్ గా బార్లు కేటాయింపు.


- కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు రూ. 4లక్షల 50 వేలు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఫీజు 2 లక్షలుగా నిర్దారణ.


- విజయవాడ,విశాఖలో దరఖాస్తు ఫీజు రూ.7 లక్షలుగా నిర్దారణ.


- ఏడాదికి లైసెన్సు ఫీజు 5 లక్షలుగా నిర్దారించిన ప్రభుత్వం.


- ఇవాల్టి నుంచి వచ్చే నెల 6 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ.


- డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు.


- అదే రోజు రాత్రి 7 గంటల కల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com