టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో చెప్పులు విసరడం, రాళ్లు విసరడం వంటి ఘటనలు చోటు చేసుకోగా, నిరసన తెలిపే స్వేచ్ఛ అందరికీ ఉంటుందంటూ డీజీపీ సవాంగ్ వ్యాఖ్యానించారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై డీజీపీ అంతటి ఉన్నతస్థాయి అధికారి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ట్వీట్ చేశారు.
"రాళ్లు విసరడం స్వేచ్ఛ అనిపించుకోదు, హింసకు పాల్పడడం స్వేచ్ఛ అనిపించుకోదు. చంద్రబాబునాయుడు గారి వాహనంపై దాడి, దాడికి పాల్పడిన వారిపై డీజీపీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు" అంటూ వ్యాఖ్యానించారు.