మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నేడు శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్కు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేలమంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏ రకమైన సమస్య ఎదురైనా తక్షణమే స్పందించగలిగే వివిధ భద్రతా దళాలకు చెందిన సిబ్బందిని ఇక్కడ మోహరించారు.