టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరట లభించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, రేపు ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చింతమనేనిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు, చింతమనేనికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.