డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ ప్రైవేటు కాలేజి ప్రిన్సిపల్ మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని నవకొండెవరంలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తపల్లి మండలం నవకొండెవరానికి చెందిన పీతల రాజు (34) డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. ఈయనకు భార్య కళ్యాణి ఉన్నారు. 2015 నుండి పిఠాపురం సీబీఆర్ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్గా పీతల రాజు పనిచేస్తున్నారు. కాలేజి ప్రిన్సిపల్ మృతిపట్ల సీబీఆర్ కాలేజీ కరస్పాండెంట్ చక్రవర్తుల సూర్యారావు తీవ్ర సంతాపాన్నివ్యక్తంచేశారు.