ముంబై : మహారాష్ట్రలో వచ్చే పాతికేళ్లూ శివసేన అధికారంలో కొనసాగుతుందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రవుత్ చెప్పారు. కాంగ్రెస్, ఎన్సిపిలతో కలిసి ప్రజల కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సిఎంపి)ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఐదేళ్లు మాత్రమే కాదు, వచ్చే పాతికేళ్లూ అధికారంలో కొనసాగుతుందని ఆయన అన్నారు.