స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన కోరుకొండలో వైయస్సార్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. చారిత్రక ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్ శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్లు శుభ్రం చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో పలు వురు అధికారులు, పోలీస్ సీఐ,పోలీస్ ఎస్ఐ, ఎంపీడీవో, వైయస్సార్ పార్టీ నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.