మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని ఎన్సిపి అధినేత శరద్ పవార్ చెప్పారు. ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ నాయకులు రేపు భేటీ కానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వారు గవర్నర్కు లేఖ అందజేయనున్నారు.