ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం : సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 09:48 PM

రోజురోజుకీ శర వేగంగా మారుతున్న టెక్నాలజీని అలవర్చుకోవడానికి, ఈ పోటీ ప్రపంచంలో నిలబడడానికి ఇంగ్లిష్‌ తప్పనిసరి అని, అందుకే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఏ స్థాయిలో ఒక్కసారి ఆలోచించాలన్న ఆయన, అప్పుడు రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని, ఆ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కేవలం ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం వల్లనే సాధ్యమని వెల్లడించారు. ఆ దిశలోనే విద్యా రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న ఆయన, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు, వాటిలో విద్యా ప్రమాణాలు పెంచడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడిమయ్‌ ప్రవేశపెడుతున్నందుకు తనను ఎందరో టార్గెట్‌ చేస్తున్నారని, అవాకులు, చెవాకులు పేలుతున్నారని, నిశిత విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. అలాంటి వారంతా తమ హిపొక్రసీ వదిలి డెమొక్రసీ విధానంలో ఆలోచించాలని కోరారు. నిరుపేద విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవకూడదా? అని సూటిగా ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయబోనని, ఈ ప్రక్రియలో ముందుకే వెళ్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com