ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం సరైనదేనని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. పార్టీ మరకపోతే ఆశ్చర్యపడాలి కానీ, అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని విష్ణుకుమార్ వ్యాఖ్యనించారు. ఆస్తులు కాపాడుకునేందుకే నేతలు బిజెపిలోకి వెళ్తున్నారనేది అవాస్తవం. జగన్ అపాయింట్ మెంట్ కోసం ఆరుసార్లు ప్రయత్నించినట్టు ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ బాగానే ఉండేవారు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా! బిజీగా ఉండొచ్చని విష్ణుకుమార్ వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని కన్నా ఎందుకు అన్నారో తెలియదని ఆయన అన్నారు.