పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకుని లయోలా విద్యాసంస్థలో గురువారం బాలల దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. లయోలా విద్యా సంస్థల అధినేత దండెం రామకృష్ణ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తుని జీవిత బీమా సంస్థ బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ సాగర్ మాట్లాడుతూ… బాల్యం దేవుడిచ్చిన వరమని, పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో మక్కువ అని అందుచేతనే ఆయన జన్మదినోత్సవం అయిన నవంబర్ 14న బాలల దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని వివరించారు. విద్యాసంస్థల అధినేత దండెం రామకృష్ణ మాట్లాడుతూ… విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ, వారిలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో జీవిత బీమా సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, డెవలప్మెంట్ ఆఫీసర్ లు రమణమ్మ, ఉదయభాస్కర్ గణేష్ ,శోభన కుమార్, లయోలా విద్యాసంస్థ ప్రిన్సిపాల్ రామచంద్ర రావు, ఏవో మధుసూదన్, హెచ్ ఎం కృష్ణ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.