మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొసలి కన్నీరు కారుస్తున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే విమర్శించారు. రాష్ట్ర పాలన పరోక్షంగా బిజెపి చేతుల్లోనే ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ముందుగా ”రచించిన” చర్యేనని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలకు ఆరు నెలల సమయం ఇచ్చారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.