ముంబై: మహారాష్ట్రలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులు ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముంబై ప్రధాన రహదారి మీదుగా రాజ్భవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకున్నారు. వర్షాలతో దెబ్బతిన్న ఉల్లి కాడలు, ఇతర పంటల భాగాలను రైతులు చేతిలో పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే.