ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు రోహిత్ శర్మ కి స్పెషల్ డే...

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 01:40 PM

రోహిత్ శర్మ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు ఒక్క రోహిత్ శర్మకే సొంతమైంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటేనే చాలు రోహిత్ శర్మ జూలు విదుల్చుతాడు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడతాడు. అలాంటి రోహిత్ శర్మ తన తొలి డబుల్ సెంచరీని ఆస్ట్రేలియాపై నవంబర్ 2, 2013న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు. ఆ తర్వాత శ్రీలంకపై రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. 2014, నవంబర్ 13న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ(264) ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్ శర్న ఇన్నింగ్స్‌లో మొత్తం మొత్తం 33 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. మ్యాచ్ మొదట్లో నిలకడగా ఆడిన రోహిత్ శర్మ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడాడు. 100 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత 173 బంతుల్లో 264 పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం. చివరి 73 బంతుల్లో రోహిత్ శర్మ 164 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో అంతకముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్(219) రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఈ రికార్డుని 2011లో ఇండోర్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. రోహిత్ బాదుడుకి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 404పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన శ్రీలంక 153 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. 2014లో ఇదే రోజున రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన సందర్భంగా ఐసీసీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 13, 2017న శ్రీలంకపై మళ్లీ మోహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో మరోసారి డబుల్‌ సెంచరీ (208) చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి నాలుగు డబుల్ సెంచరీలు చేసింది భారత క్రికెటర్లే కావడం విశేషం. తొలుత సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్) దక్షిణాఫ్రికా జట్టుపై తొలి డబుల్ సెంచరీ చేయగా, ఆ తర్వాత 2011లో వెస్టిండిస్‌పై సెహ్వాగ్(218) డబుల్ సెంచరీ సాధించాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com