ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియం బోధనపై నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మొదటి దశలో భాగంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధించాలని సీఎం జగన్ సమావేశంలో నిర్ణయించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.