ఐదేళ్ల చంద్రబాబు పాలన తప్పుల తడకగా సాగిందని, అందుకే ప్రజలు వైసీపీని గెలిపించారని అన్నారు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. గతంలో చంద్రబాబు చేసిన తప్పుల వల్లే జగన్ అధికారంలోకి వచ్చారని స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యక్తిగతంగా కష్టపడి ఉండొచ్చు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అవే తప్పులు చేస్తోందంటూ మండిపడ్డారు. వైసీపీ విధానాల వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని అన్నారు సుజనా చౌదరి.