బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. హర్సింగ్పురా గ్రామంలో నిన్న ఐదేళ్ల బాలిక ఆడుకుంటూ 50 ఫీట్ల లోతున్న బోరుబావిలో పడిపోయింది. చిన్నారి పొలంలో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బాలిక తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.