ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బోటు వెలికితీసినందున ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. కచ్చులూరు తరహా బోటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.