చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో గల పంట పొలాలపై ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఐరాల మండలం రంగమ్మ చెరువు, బీరప్ప చెరువు, మొరవ వడ్డేపల్లి ప్రాంతాల్లో రాత్రి నాలుగు ఏనుగుల గుంపు పంటలపై పడి విధ్వంసం సృష్టించింది. దీంతో వరి, వేరుశెనగ, మామిడి, టమోటా వంటి పంటలకు తీరని నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.