భోపాల్: ఎలా చేరిందో ఆ ఆడ కుక్క భోపాల్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్వే యార్డులోని పట్టాల కుప్ప కిందకు చేరింది. అక్కడే రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అక్కడ నుంచి బయటకు రావడానికి వీల్లేని పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. గమనించిన వారు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు రంగంలోనికి దిగి పట్టాల కుప్ప కింద చిక్కుకుపోయిన తల్లి కుక్కను, రెండు కుక్కపిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన ఆదివారంం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.