కర్నాటక మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూశారు. ఆయన వయసు 81 ఏళ్లు. కర్నాటక-హైదరాబాద్ పోరాట సమితికి ఆయన అధ్యక్షుడిగా చేశారు. వైజనాథ్కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. 1984లో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో హార్టికల్చర్ మంత్రిగా చేశారు. 1994లో దేవగౌడ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. గుల్బర్గా వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. హైదరాబాద్-కర్నాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కళ్యాణ కర్నాటక పోరాటాన్ని చేపట్టారు.