మిస్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలకు అన్నదాత కూతురు ఎంపికైంది. ర్యాంప్పై తన ప్రతిభను చాటుకుంటూ ఈ ఏడాది నవంబర్ 18న ఇండోనేషియా దేశంలోని జకర్తాలో జరుగనున్న మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ పోటీలకు ఎంపికయ్యారు నిషా తాళంపల్లి. ఆన్లైన్ ద్వారా తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రజలు తనకు ఓటు వేస్తే టైటిల్ సాధించవచ్చని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా, హుమ్నాబాద్ మండలం, దుమున్సూర్ గ్రామంలోని రైతు కుటుంబంలో జన్నించిన తాను గత ఐదేండ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నానని తెలిపారు. ఆన్లైన్లో తన పేజీ ఓపెన్ చేసి లైక్ కొడితే ఒక పాయింట్ లభిస్తుందని, ఒక్కో పాయింట్ తనను మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్కు దగ్గర చేస్తుందని ఆమె పేర్కొన్నారు.