బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగత్ ప్రకాష్ నడ్డా తొలిసారిగా ఎపి పర్యటనకు రానున్నారు.. ఈ నెల 10 వ తేదిన విజయవాడలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.. ఈ మహా సమ్మేళనంలో ఎపిలోని బూత్ స్థాయి కార్యకర్తలందరూ పాల్గొనవలసిందిగా ఆ శాఖ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పిలుపు ఇచ్చారు.