ఢిల్లీలో బంగ్లాదేశ్తో జరిగే తొలి టీ20 వేదికను మార్చాలంటూ పర్యావరణవేత్తలు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు. కాలుష్యం, మంచు కారణంగా వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యతతో ఆటగాళ్లు ఇబ్బందులకు గురికావల్సి వస్తుందని, దీని కారణంగా తొలి టీ20ను ఢిల్లీకి బయట నిర్వహిస్తే బాగుం టుందని ఆ లేఖరు వారు పేర్కొన్నారు. అంతేగాకుండా ఇటీవల ముగిసిన దీపావళికి బాణాసంచా కాల్చడం ద్వారా కూడా ఢిల్లీ కాలుష్యభరితంగా మారిందని ఈ పరిణామాల నేపథ్యంలోనే టీ20 వేదికను మార్చితే బాగుంటుందని తెలిపారు. పై కారణల కారణంగా డిసెంబర్ 2017లో శ్రీలంక ఆటగాళ్లు మైదానంలోనే వాంతులు చేసుకొన్న సంగతి వారు ఆ లేఖలో పేర్కొన్నారు.