శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. మాసోత్సవాల తొలి రోజే భక్తులు పాతాళగంగలో కార్తీక స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు నిర్వహించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆకాశదీపాన్ని వెలిగించారు. వనబోజనాల్లో భాగంగా శివదీక్షా శిబిరాల్లో భక్తులకు అన్నదాన శిబిరానిన ప్రారంభించారు.