అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ హోమ్ మంత్రి సుచరిత అన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. ప్రైవేట్ స్కాంలో..ప్రభుత్వం సాయం చేయడం ఇదే తొలిసారి అని చెప్పిన హోమ్ మంత్రి, గతంలో టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు పట్టించుకోలేదని విమర్శించారు. ఆస్తులను వేలం వేయడం ద్వారా పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సుచరిత, అగ్రిగోల్డ్ బాధితుల్లో వెలుగులు నింపడం తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.తొలి కేబినెట్ భేటీలోనే బాధితులను ఆదుకునేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కులం మతం చూడకుండా బాధితులకు సీఎం న్యాయం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.1150 కోట్లు కేటాయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణ జరుగుతుంది'అన్నారు. ప్రభుత్వ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.