న్యూఢిల్లి : యూరోపియన్ పార్లమెంటు సభ్యులు కాశ్మీర్ సందర్శనకు రావడంపై కాంగ్రెస్ నాయకుడు ఆనంద్శర్మ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తోందని ఆయన అన్నారు. తాము కాశ్మీర్ పర్యటనకు వెళితే విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు. స్వదేశానికి చెందిన ఎంపిలను కాశ్మీర్ పర్యటనకు అనుమతించలేదని, కానీ, విదేశీ ఎంపిలను సాదరంగా ఆహ్వానిస్తున్నారని ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు.