ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ను వ్యతిరేకించడమే పవనిజం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2019, 01:17 AM

 ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టిన జ‌న‌సేనాని పవన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవర్ని ప్రశ్నిస్తున్నారో ఆలోచించుకోవాల‌ని అన్నారు రాష్ట్ర స‌మాచార శాఖామంత్రి పేర్ని నాని.  శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ‘  కేవలం సీఎం జగన్‌ను మాత్రమే ప్రశ్నించ‌డ‌మే ప‌నిగా ప‌వ‌న్ పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు . ఇప్పుడు కూడా త‌మ పార్టీనే ప్రశ్నిస్తున్నారు’ అని విమర్శించారు. ‘రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నిర్లజ్జగా ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు. టీటీడీ నిధులను కూడా దీక్షల కోసం ఖర్చు చేశారు. సొమ్ము ప్రజలది... సోకు టీడీపీది అన్నట్టుగా వ్యవహరించారు అప్పుడు ఎందుకు నిల‌దీయ‌లేద‌ని అన్నారు నాని.


ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పవన్ దాని కోసం ఎందుకు మాట్లాడలేదు. సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌ను వ్యతిరేకించడమే పవనిజంగా ఉంది’ అని నాని ధ్వజమెత్తారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com