భారతావనికి ఒలంపిక్స్లాంటి అంతర్జాతీయ క్రీడా వేదికలలో పలు అంశాలలో పతకాలు సంపాదించి పెట్టిన క్రీడాకారులను అభ్యర్ధులుగా ప్రకటించి ఎన్నికలలోలబ్ది పొందాలన్న భాజపా ప్రయత్నాలను తిప్పికొట్టారు ఓటర్లు. హర్యానాలో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన బిజెపి హర్యానా యువతనుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి ప్రముఖ క్రీడాకారులను పోటీకి నిలపింది. ఇలా పోటీ చేసిన వారిలో రెజ్లర్లు బబితా ఫొగాట్, యోగేశ్వర్ దత్ కూడా ఉన్నారు. వారు ఈ దేశానికి పతకాలు కురిపించినట్టు ఓటర్లు వారికి ఓట్లు కురిపించక పోవటంతో ఓటమి చవిచూసారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే భాజపాలో చేరిన బబితా ను దాద్రీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. అయితే కొన్నేళ్లుగా పార్టీలో ఉంటటున్న తనని కాదని బబితకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తికి గురైన భాజపా నేత సంబీర్ సాంగ్వాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి బబితపై విజయం సాధించారు. అలాగే ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ను బరోడా నియోజకవర్గం నుంచి బిజెపి బరిలోకి దింపింది . ఎన్నికల సమయంలో ప్రధాని సైతం ప్రచారం చేసినా యోగేశ్వర్ జనాలను ఆకట్టుకోవటంలో విఫలమయ్యారనేందుకు తాజా ఫలితాలే ఉదాహరణ. ఆయన అభ్యర్థి కృష్ణ హుడా చేతిలో ఓటమిచవి చూడాల్సి వచ్చిందిద. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ పెహోవా నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో చాలా కష్టపడి గెలుపొందటం విశేషం.