పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డార్జిలింగ్లోని కొండలపై 10 కిలోమీటర్ల దూరం జాగింగ్ చేశారు. మమతా బెనర్జీ వెంట సెక్యూరిటీ సిబ్బంది, జర్నలిస్టులు ఉన్నారు. పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా ఆమె కొండలపై జాగింగ్ చేశారు. జాగింగ్ సమయంలో కూడా ఆమె మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లి ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించారు. అయితే వాటిపై మమత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.