హ్యూస్టన్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సభలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించినట్లుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన అలహాబాద్లో మీడియాలో మాట్లాడుతూ త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు, ప్రవాస భారతీయులు ట్రంప్కి మరోసారి పట్టం కట్టాలంటూ ప్రధాని మోడీ పిలుపునివ్వడాన్ని ట్రంప్ రాజకీయ ఎత్తుగడ అన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. హ్యస్టన్ పరిసరాలలో ప్రవాస భారతీయులు అధికంగా ఉంటారని, కొంత కాలంగా ఎదురు గాలి వీస్తున్నందున ట్రంప్ వ్యూహాత్మకంగా మోడీని రంగంలోకి దింపారని ఈ కార్యక్రమం వల్ల అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య వ్యవహారాలు ఎలా ఉన్నా రాజకీయంగా అటు ట్రంప్కి, ఇటు మోడీకి కలసివచ్చే వ్యూహా త్మ కమైన, తెలివైన చర్య 'హౌదీ మోదీ' కార్యక్రమంగా ప్రశాంత్ కిషోర్అభివర్ణించారు.