ఏపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ, సచివాలయంలో ఉద్యోగులను గురువారం భారీగా బదిలీ చేసింది. జీఏడీ మొత్తం 108 మందిని అంతర్గత బదిలీ చేసింది. 20 మంది ఏఎస్, 40 మంది ఎస్ఓ, 48 మంది ఏఎస్ఓలను బదిలీ చేసింది. మరోవైపు ఇరిగేషన్ శాఖలో ఒకేసారి 105 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను బదిలీ చేసింది. ఇరిగేషన్ ఈఈలను బదిలీచేస్తూ.. జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.