చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం ఇరుగువాయి గ్రామంలో స్విమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో కేన్సర్ వ్యాధిపై గురువారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ పింక్ బస్సు ‘ను నగరి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలనూ ప్రారంభించారు. మహిళల్లో కేన్సర్ చికిత్సకు చేయూత నిమిత్తం స్విమ్స్ ఈ బస్సును తయారు చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు.