కొడుకు చనిపోయాక కోడల్ని పట్టించుకోని ఈరోజుల్లో అత్తింటివారు ఆదర్శంగా నిలిచారు. వితంతుగా ఉన్న కోడలు పడుతున్న బాధలు చూడలేక తండ్రి పాత్ర పోషిస్తూ మహిళకు వేరే వివాహం జరిపించాడు ఓ వ్యక్తి. ఒడిశా రాష్ట్రం నబరంగ్ పూర్ జిల్లా ఎకోరిగావూర్ గ్రామంలో కమల్ లోచన్ మఝీ కుమారుడు లలిత్ తో నైనా అనే యువతికి 2013లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాది తర్వాత ఓ బాబు పుట్టాడు. కొద్దిరోజులకు రోడ్డుప్రమాదంలో లలిత్ మరణించాడు. అప్పటి నుంచి ఇంటి వద్ద ఉంటూ కుమారుడి బాగోగులు చూసుకుంటూ ఇబ్బందులు పడుతున్న కోడలు బాధను మామ తట్టుకోలేక పోయాడు. ఆమెకు మళ్లీ పెళ్లి చేసి జీవితాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. సంబంధం మాట్లాడుకు వచ్చి రెండకరాల వ్యవసాయ పొలం ఇచ్చి వేరే పెళ్లి జరిపించారు.