అయోధ్యలోని రామాలయం (రామ్ లల్లా) ప్రధాన అర్చకుడితో పాటు ఇతర ఎనిమిది మంది సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ జీతాలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ జీతం రూ. 13 వేలకు పెరిగింది. ఇతర సిబ్బంది జీతాలను రూ. 500 పెంచారు. వీరి జీతాలు రూ. 7,500 నుంచి రూ. 10 వేల మధ్య ఉన్నాయి. ఈ సందర్భంగా సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, తమ జీతాలు కొంత మేర పెరిగినప్పటికీ తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. జీతాలు పెంచాలని గత నెలలో తాము కోరామని... జీతాలను పెంచుతున్నట్టు తమకు ఐదు రోజుల క్రితం ప్రభుత్వ నుంచి సమాచారం అందిందని చెప్పారు.