కృష్ణా : కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బ్యారేజీ 70 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో జగ్గయ్య పేట నుండి హంసలదీవి వరకు ఉన్న ముంపు గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేదని మొదటి హెచ్చరిక మాత్రమే జారీ చేశామని ఇరిగేషన్ ఎస్సి కెవిఎల్ఎన్పి చౌదరి తెలిపారు.