కేంద్ర ప్రభుత్వం ఫేమ్–2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకం కింద దేశంలో 64 నగరాలకు 5,595 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోని విశాఖకు వంద బస్సులు విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున మంజూరు చేశారు. ఇప్పటికే విశాఖకు బస్సులు చేరుకున్నాయి. అతి త్వరలో విశాఖలో విద్యుత్ బస్సుల్ని తిప్పేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు విజయవాడ, తిరుపతిలోని పలు ప్రదేశాలకు వీటిని తిప్పే యోచనలో ఆ ర్టీసీ ఉంది. కాగా వీటి నిర్వహణ, టికెట్ ధరలపై ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉందని సమాచారం