సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లు ఇస్తాను సారం ఆపేస్తే అందుకు జరిగే నష్టం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానా నుంచే ఉత్పత్తిదారులకు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పునర్వినియోగ విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి డీపీ యాదవ్ రాష్ట్రాలకు లేఖలు పంపినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి పవన, సౌర విద్యుత్తును తమ వినియోగాలకు ఖచ్చితంగా తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ తాము పేర్కొన్న కారణాలు కాకుండా ఇతర కారణం చూపుతూ విద్యుత్తు తీసుకోవటం ఆపేయాలని నిర్ణయించడం సహేతుకం కాదని తేల్చి చెప్పింది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్తును తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, కావాలని అలా చేస్తే ఆ విద్యుత్తు తీసుకోకపోయినా అందుకు సంభందిత డబ్బు ఆ కంపెనీలకి రాష్ర్టాలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. విద్యుత్ గ్రిడ్ కూలిపోతుందని అనుకున్నప్పుడు , గ్రిడ్ రక్షణ కోసం మాత్రమే వాటి నుంచి విద్యుత్ తీసుకోవడం ఆపుచేయాలని, ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తిదారులకు ఆ కారణాన్ని లిఖితపూర్వకంగా తెలపాలని సూచించింది.