హైదరాబాద్: తమిళనాడులో జరిగే వేలన్కన్ని వేడుక నేపథ్యంలో సికింద్రాబాద్- వేలన్కన్ని, వేలన్కన్ని- కాకినాడ పోర్ట్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ 5, 6, 8, 9 తేదీల్లో నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. పలు మార్గాల్లో జరుగుతున్న మరమ్మతుల కారణంగా పాటలీపుత్ర- యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్, చన్నై ఎగ్మోర్ వీక్లీ ఎక్స్ప్రెస్, దర్బంగా- మైసూర్ ఎక్స్ప్రెస్లను దారి మళ్లించినట్టు పేర్కొంది. గుంతకల్లు- డోన్ రైలును బుధవారం (జూలై 31న) రద్దు చేసినట్లు తెలిపింది.