ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేలన్‌కన్ని వేడుకకు ప్రత్యేక రైళ్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2019, 09:53 AM

హైదరాబాద్: తమిళనాడులో జరిగే వేలన్‌కన్ని వేడుక నేపథ్యంలో సికింద్రాబాద్- వేలన్‌కన్ని, వేలన్‌కన్ని- కాకినాడ పోర్ట్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను సెప్టెంబర్ 5, 6, 8, 9 తేదీల్లో నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. పలు మార్గాల్లో జరుగుతున్న మరమ్మతుల కారణంగా పాటలీపుత్ర- యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, చన్నై ఎగ్మోర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, దర్బంగా- మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్టు పేర్కొంది. గుంతకల్లు- డోన్ రైలును బుధవారం (జూలై 31న) రద్దు చేసినట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com