హైదరాబాద్: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. మంగుళూరులోని నేత్రావతి నది వద్ద అతను కనిపించకుండాపోయినట్లు తెలుస్తోంది. సోమవారం బెంగుళూరులో ఇంటి నుంచి సిద్ధార్ధ వెళ్లినట్లు మంగుళూరు పోలీసు కమిషన్ సందీప్ పాటిల్ తెలిపారు. స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సకలేశ్పూర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన సిద్ధార్థ.. తన డ్రైవర్తో కలిసి మంగుళూర్ వెళ్లాడు. అయితే నేత్రావతి నది వద్దకు చేరుకున్న తర్వాత.. సిద్ధార్థ ఆ నడి బ్రిడ్జ్పై దిగి కారు డ్రైవర్ను పంపేశాడు. ప్రస్తుతం నేత్రావతి నదిలో బోట్లతో సిద్ధార్థ కోసం వెతుకుతున్నారు. స్థానిక జాలర్లు కూడా పడవల్లో గాలింపు చేపట్టారు. అయితే మంగుళూర్ కమిషనర్ పాటిల్ బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఆయన ఎస్ఎం కృష్ణ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.సిద్ధార్థ భార్య, ఇతర కుటుంబసభ్యలతో మాట్లాడారు.