నౌకాదళ సేవల్లోకి ఐఎస్ ఎల్సీయూఎల్ -56 ప్రవేశించింది. విశాఖ నావెల్ డాక్ యార్డు నుంచి నౌకాదళ సేవల్లోకి నౌక ప్రవేశించింది. తూర్పు నౌకాదళాధిపతి వైఎస్ అడ్మిరల్ ఏకే జైన్ దీనిని ప్రారంభించారు. పోర్టు బ్లేయర్ కమాండ్లో సేవలు అందించనుంది. తీరప్రాంత భద్రత దిశగా పనిచేయనుంది. జవాన్లు, యుద్ధట్యాంకులు ఒక చోట నుంచి మరొక చోటికి చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. అత్యవసర సమయాల్లో కూడా ఇది సేవలు అందించనుంది.