వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలపై శ్రేణులపై వరుస దాడులు జరుగుతుండగా ఆ పార్టీ నేతల భద్రత విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే విపక్ష నేత, మాజీ సిఎం చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరీ భద్రత నిబంధనల మేరకు ఉన్న కాన్వాయ్లో ఎస్కార్ట్ వాహనం, పైలట్ క్లియరెన్సు వాహనాన్ని తొలగించిన జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలవైపు దృష్టి సారించింది. ఇటీవలగుంటూరు జిల్లాకు చెందిన మరికొంత మంది టీడీపీ నేతలకు కూడా భద్రతను కుదించగా, తాజాగా నరసరావుపేట మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు ఉన్న గన్మెన్లను తొలగించింది. ఇది వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని టీడీపీ వర్గాలు మండి పడుతున్నాయి.