ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 12:47 PM

 కృష్ణానది తీరంలో ఉండవల్లి కరకట్ట పక్కన శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో  శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాలు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి.  శ‌నివారం నుంచి 3 రోజులుపాటు ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకూ కార్యక్రమాలుంటాయని నిర్వహకులు ఓప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విశాఖ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మను నియమించి,  పీఠం భావి బాధ్యతలను ఆయనకు అప్పగించనున్న విష‌యం విదిత‌మే.  ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు పీఠాల అధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు.  


మూడు రోజుల కార్యక్రమాలు వివ‌రాలుఇలా ఉన్నాయి 


శ‌నివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు జ‌రిగాయి.   రెండో రోజు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు జ‌రుగుతాయి.  మూడో రోజు సోమ‌వారం ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం జ‌రుగుతాయ‌ని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం , సాయంత్రం జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం జరగనున్నాయ‌ని శార‌దాపీఠం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లొ తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com