న్యూఢిల్లి : వైమానిక దళానికి చెందిన ఎఎన్ 32 విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారని ఐఎఎఫ్ బృందం పేర్కొంది. ఎఎన్ 32 కూలిపోయిన ప్రాంతానికి ఐఎఎఫ్ బృందం చేరుకుంది. ఎవరైనా జీవించి ఉన్నారేమోనని గాలింపు చర్యలు చేపట్టింది. కానీ ఫలితం లేకపోవడంతో విమానంలో ప్రయాణించిన వారు మరణించారని ధృవీకరించింది. ఈ వార్తను బాధిత కుటుంబాలకు తెలియజేశారు.