అమరావతి: శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపికైన నాలుగో స్పీకర్ తమ్మినేని సీతారాం అని వైసీపీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికవడం మంచి సంప్రదాయమన్నారు. అసెంబ్లిలో ప్రజాస్వామ్య ఉల్లంఘనలు జరిగాయన్నారు. వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికార పక్షంలోని వ్యక్తిని సభాపతిగా ఎంచుకుంటూ వచ్చామన్నారు. ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలు తెలుసుకోవడానికి సరైన వేదిక అసెంబ్లి అన్నారు.